
అవి వేసవి కాలం రోజులు .
నేను నా మిత్ర బృందం పదో తరగతి పరిక్షలు రాసేసి నెత్తి మీద కొండంత బరువు దించేసుకుని,
సాయంత్రం అయ్యేసరికి మా ఊరి 'లాకులు' మీదకి చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం .
మా మిత్ర బృందం లో సభ్యులం 'పంచ పాండవులు' లా ఐదుగుర మే కానీ ,
కొంటె పనులు దగ్గరి కి వచ్చేసరికి 'దుష్ట చతుష్టయం' లా నలుగురమే -సాయి ,జానీ ,ప్రసాదు ,నేను !
కృష్ణ మోహన్ గాడ్ని ఐతే వాళ్ళింటిలో వాళ్ళు బయటకి పంపేవారు కాదు .(వాడు ఇంట్లో ..రాముడు మంచి బాలుడు టైపు అన్న మాట !బయటకు వస్తే చిలిపి కిట్టయ్యే !)
మా ఐదుగురు లో నలుగురుం ఇంచుమించు గా ఒకే నడవడిక లో ఉంటాం కానీ ..జానీ బాబు గాడు మాత్రం కళ్ళు తాగిన కోతి టైపు .
వాళ్ళ అమ్మ నాన్న ల కి పెళ్ళైన చాలా రోజుల వరకూ పిల్లలు పుట్టకపోతే,యేసు ప్రభువు ని నమ్ముకున్నాక పుట్టాడంట వాడు .
అందుకే "జానీ బాబు "అని పేరు పెట్టారంట వాడి కి !మనసు కి దయామయుడే కానీ .మనిషే కాస్తంత వంకర .
అలాంటి వంకర మనిషి..ఆ వేసవి సాయం కాలం చేసిన ఓ 'వంకర పని' గురుంచి తరువాత టపా లో చెబుతాను .
{కొంచెం పని ఉంది ..ఏమీ అనుకోకండే }!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి