30, నవంబర్ 2010, మంగళవారం

కాలేజ్ లవ్ !



నవ యవ్వన కళాశాల ...


రెండు జెడల సీత ...నెమలి నడకల్ని నేర్చి కొత్త అడుగులేస్తుంది !
నూనూగు మీసాల కోడె కుర్రోడికి ...లేలేత కొమ్ములు మొలక లేస్తాయి !!




సీత ... 'సిరిమల్లె 'అవుతుంది !
కోడె కుర్రోడు ... 'గండు తుమ్మెద' వుతాడు !!

కళాశాల ఓ " బృందావనం " !!

ఈ వలపుల దారిలో మలుపులెన్నో !
తలపుల జల్లుల్లో 'మైమరపు' లెన్నో !!

కవ్వింతలెన్నో ...!
ప్రణయ కలహాలు ఎన్నో ...!!

ఆ "కమ్మని కల" కాలం తో కదులుతుంది!
ఆ కదిలే కాలం ఓ కథకి 'సాక్షి 'అవుతుంది !!




చివరికి ,ఆ ప్రణయ గాధ కన్నీరైందో ....?!
పన్నీరై కురిసిందో ?!
కదిలే కాలాన్ని అడిగితే .....
ఓ" కమ్మని వ్యధ" ని కథలు కథలు గా చెబుతుంది !!


నోట్ : అయ్యో ..రామా !
మన అబ్దుల్ కలామ్ గారు" కలలు" కనమన్నది .......
ఈ" కలల్ని" కాదు ఫ్రెండ్స్ !!

27, నవంబర్ 2010, శనివారం

సోనియమ్మ 'ఆట '!

మా చిన్నపుడు మేము ఎంతో ఇష్టంగా గా ఆడే ఆట 'దాగుడు మూతలు' .

దాగుడు మూతలు అంటే..మామూలు గా కళ్ళకి గంతలు కట్టుకుని ఆడే ఆట కాదు .

మేము ఆడే ఆట విధానంబెట్టిదనగా ..,మేము 'ముద్దాయిగా 'నిలబెట్టిన ఒకతను ఓ చోట నిలబడి గట్టిగా కళ్ళుమూసుకుని...ఒకటినుండి పది వరకూ అంకెలు లెక్కపెట్టాలన్న మాట ! ఈ లోపు మిగిలిన పిల్లలమంతా ..ఆ మనిషికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో దాక్కోవాలి .ఆలా దాక్కున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టాలి (అలా జట్టులో చివరి మనిషి వరకూ దొరకాలి ) .

ఒక వేళ ఈ ఆట మద్యలో జట్టు లో ఎవరైనా ఆ 'వెదికే మనిషి' చూడకుండా వెనకనుండి వచ్చి "ఎస్" అని గట్టిగా అరుస్తూ ఆ మనిషిని ని ముట్టుకుంటే మళ్లీ ఆ మొదటి వ్యక్తే మళ్లీ మొదటినుండి ఆట ఆడాలి . అంటే ..చివరికంటా ఎవరికీ చిక్కకుండా అందరిని అవుట్ చెయ్యాలన్న మాట ! అలా చివరికంటా కనిపెట్టగలిగితే ...ఆ ఆటలో మొట్ట మొదట దొరికిన మనిషి 'ముద్దాయి' . అలా దొరికిన ముద్దాయి చేత ఇరవై గుంజీలు తీయించి ,మళ్లీ కొత్త ఆటని మొదలు పెట్టేవాళ్ళం .

ఇలా సాగేది మా ఆట!కొంచెం కష్టమే !ఎక్కువ సార్లు మనం ముద్దాయిగా దొరకుండా ఉండాలంటే ..మనకి ఒక అనుకూల వర్గం ఒకటి ఉండాలి .ఆ వెదికే వాడు మనవాడు అయితే .. పొరపాటున మనం ముందు కనిపించినా 'తూచ్ 'అన్నమాట ! పేరు కి అటే గానీ, ఆ ఆట ఎప్పుడూ కక్ష సాధింపు దిశ గానే జరిగేది . ఏక పక్షం గానే సాగేది . దీనంతటికి మూల 'సూత్రధారి ' మా తో కలిసి ఉంటూ ,మా తోనే గొడవలు పడే 'దుర్గ '.వయసులో మా కంటే కొంచెం చిన్నదే అయినా ,ఆలోచనల్లో మాత్రం ఆపిల్ల దేశముదురు !వాళ్ళ ఇంటి లో నుండి తెచ్చిన నువ్వుపప్పు జీడి లని ,మామిడి తాండ్ర లాంటి చిరు తిళ్ళు చూపించి ..మా జట్టులోని సగం మంది ని తనవైపుకే లాక్కోనేసేది .అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె 'పెత్తందారీ తనాన్ని' భరించాల్సివచ్చేది.

మొదట ఆట తనే మొదలు పెట్టేది ,ఆనక తనకి గిట్టని పిల్లల్ని తనే ఒక ఆట ఆడించేది . ప్రతీ ఆట లోనూ తనకి ప్రతికూలం గా ఉండే ఆటగాళ్ళని 'ముద్దాయి' లు గా చేసి గుంజీలు తీయించి ,మూడు చెరువుల నీళ్ళు తాగించేది .ఆ రకం గా వాళ్ళ మీద కక్ష తీర్చుకునేది .ఈ ఆటలో ..చిరుతిళ్ళు కి అలవాటు పడ్డవాళ్ళని ,కాస్తో కూస్తో అమాయకుల్ని తనకి అనుకూలం గా వాడు కుంటూ తన మాట లెక్కచేయని వాళ్ళ ఆట కట్టించేది.తనకి నచ్చినట్టు రూల్సు మార్చి దబాయించి మరీ తన ఆధిపత్యాన్ని నిలుపుకునేది ..అందరూ తను చెప్పినట్టే వినాలనే పంతం దుర్గది! .ఆ ఆధిపత్య ధోరణి ఆమె వయసుతో పాటే పెరిగి పెద్దదయ్యింది . తను పెద్దయ్యాక ఓ నాయకురలవుతుందేమో అనుకునేవాన్ని నేను !కానీ పెళ్లై అత్తారింటికి వెళ్లి తల్లైంది .

చాల రోజుల తరువాత నాకు దుర్గ గుర్తుకొచ్చింది -అది కూడా అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షురాలు సోనియమ్మ దయవల్లే!గత కొద్ది రోజులుగా దేశం లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని చూస్తే ..మా దుర్గ కి ఆ అమ్మి కి ఏవో దగ్గరి పోలికలు ఉన్నాయనిపించింది నాకు .

దేశ రాజకీయాలలో ఎక్కడైనా ,ఎప్పుడైనా వాళ్ళ పార్టీ కి గానీ,వాళ్ళ కుటుంబ వారసత్వానికి గానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినపుడు ఆమె అవలంబిస్తున్న తీరు ఆమెలోని 'ఆధిపత్య ధోరణికి 'అద్దం పడుతుంది.

"ఈ ఆధిపత్య ధోరణి అనేది ఇవాల్టి విషయం కాదని" ..కొద్దో గొప్పో రాజకీయ పరిజ్ఞానం ఉన్న మా పెద నాన్న గారు చెప్పినపుడు నాకు కొంచెం పరిస్థితి అర్ధమైంది . "ఈ గాంధీ కుటుంబీకులకి 'దేశాధికారం' తమ చేతులు దాటిపోవడం ఇష్టం ఉండదట !తమ అధికారాన్ని ,ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఏమి చెయ్యడానికైనా వెనకాడరట . ఆమె 'అత్తమ్మ' ఇందిరమ్మ హయాం లో ఈ 'హవా 'బాగా నడిచిందట !ఆమె అమలుపరిచిన "ఎమర్జన్సీ " ఆమెకి ఓ మాయని మచ్చ గా మిగిలిపోయింది !"

ఇందిరమ్మ గురుంచి మా పెదనాన్న గారు చెప్పిన మాటలేమో గానీ..,సోనియమ్మ విషయం లో మాత్రం ఈ 'హవా' నూటికి నూరు పాళ్ళు నిజమనిపిస్తుంది నాకు .మొన్న మన రాష్ట్రం లో జరిగిన' రాజకీయనాటకాన్ని' ఎంతో రసవత్తకరంగా రక్తి కట్టించినపటికి అసలు నిజం అతి సామాన్య మానవుడికి కూడా అర్ధమైపోయింది .సోనియా ఏక పక్ష నిర్ణయం వల్లే రోశయ్యగారు 'పదవీ విరమణ' చెయ్యడం ,కొత్త ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ గారు భాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నది ఇట్టే తెలిసిపోతుంది . ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకు ఉన్న వ్యక్తిగత కారణాలు ఏమైనప్పటికీ ..ఈ డిల్లీ పెద్దలకి తెలుగు ప్రజానీకం పట్ల ,వారి మనోభావాల పట్ల కొంచెమైనా గౌరవం లేదన్న విషయం మాత్రం తేటతెల్లమవుతుంది .ప్రజలు ఎంతో నమ్మకం తో ఎన్నుకున్న నాయకుల ప్రమేయం కొంచెమైన లేకుండా (మాట్లాడే స్వేచ్చ ఇవ్వకుండా ..అనడం సబబు ) సోనియగారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తెలుగు ప్రజల్ని అవమాన పరచడమే . ఇలాంటి అవమానాల్ని చవిచూడటం వల్లే తారకరామారావు గారు "తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం " అన్న నినాదం తో ఓ పార్టీని స్థాపించి ,విదేశాలలో తెలుగు మహా సభలు పెట్టి తెలుగు జాతి 'ఆత్మ గౌరవాన్ని' అంతర్జాతీయం గా వెలుగెత్తి చాటారు .బిడ్డ ఆకలి ..తల్లి కి తెలుస్తుంది!ఓ తెలుగు వాడి ఆత్మఘోష ఆత్మాభిమానం ఉన్న తెలుగు వాడికే తెలుస్తుంది . అందుకే మన తెలుగు వాళ్ళకి చుర కత్తి లాంటి తెలుగోడే నాయకత్వం వహించాలి -వెన్నెముక లేని కీలుబొమ్మ లు కాదు !

రాష్ట్రాల్లో 'అధికారమే' ఆ పార్టీ ప్రధాన అజెండా గా నడుచుకునే ఈ డిల్లీ నాయకత్వం ,ప్రజల మనోభావాల గురుంచి ..వాళ్ళ కష్ట ,నష్టాల గురుంచి ఆలోచిస్తుంది అనుకోవడం అవివేకం !వాళ్ళకి కావలసిందల్లా ..వాళ్ళు చెప్పినట్టు వినే కీలుబోమ్మల్లాంటి 'స్థానిక నాయకులు 'మాత్రమే !

ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే .. ఇప్పుడున్న నాయకుల్లో కాస్తో కూస్తో ఆత్మాభిమానం ఉన్న రోశయ్య గారు ఆ 'కీలుబొమ్మ' పనిని సక్రమంగా నిర్వర్తించలేకే ..రాజీనామా చేసారా ?!లేక ..అధిష్టానమే తమ ప్రతికూల వర్గీయులకి 'చెక్' పెట్టడానికి ..అదే సామాజిక (ప్రత్యర్ధి సామాజిక వర్గం )వర్గానికి ,ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ని చేసారా అనేది దైవ రహస్యం !ఈయన గారైనా ..తారక రామారావు గారి లా ,రాజశేఖరుడు లా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని జగతికి వెలుగెత్తి చాటేలా పరిపాలిస్తాడో.. లేకుంటే, 'అమ్మ భజన 'చేస్తూ కీలుబొమ్మాలానే మిగిలిపోతారా అనేది ప్రస్తుత ప్రశ్న?! ఏది ఏమైనా ..ఈ 'కుర్చీలాట' చిన్న పిల్లల 'బొమ్మలాట 'లా అయిపోవడం మన ఆంధ్రరాష్ట్ర దురదృష్టం !సంవత్సరానికి ఒకరు చొప్పున కొత్తగా కుర్చీ ఎక్కిన సి .ఏం లు ,ఆ కుర్చీలో కుదురుకోవడానికే కొన్ని రోజులు గడిచిపోతాయి ..ఇంక రాష్ట్ర అభివృద్ధి గురుంచి ,సంక్షేమం గురుంచి ఆలోచించే సమయం ఎక్కడిది ?!

ఎంతైనా మా 'దుర్గ' నే నయం !తను మా ఆటలో కొన్ని రూల్సుని మార్చేది గానీ ..ఈ సోనియమ్మ లా మొత్తం 'ఆట' నే మార్చేది కాదు !!

21, నవంబర్ 2010, ఆదివారం

అభిమాన సంఘాలు !




"ఒరేయ్ ..ఆడేం పార్టీ?"

"మన పార్టీనేరా..క్రిష్ణా పార్టీ .."

వేసవి సెలవుల కి మా ఊరోచ్చిన మా చిన్నమ్మ కొడుకు శీను ని మా జట్టు కుర్రోల్లకి పరిచయం చేసేవాడ్ని . "మరి ఆడో ..? "మాకు కాస్తంత దూరం లో నిలబడి నేల చూపులు చూస్తున్నమా మావయ్య కొడుకు యోగి గాడి గురుంచి కాస్తంత డౌటు గానే అడిగేవారు మా జట్టు వాళ్ళు . "మరే ..మరే ఆడు చిరంజీ{చిరంజీవి } పార్టీ రా .." నేను నీళ్ళు నమిలేవాడ్ని. "యోగ్గాడు మన ఆటలో వొద్దు .శీను గాడ్ని రమ్మను . " అనేసి ఆటల్లో నిమగ్నమై పోయేవాళ్ళు . యోగ్గాడు మాత్రం ముఖం మాడ్చుకుని ఓ మూలన కూచునేవాడు. వాళ్ళ ఊరికి వెళ్తే నా పరిస్థితి కూడా అంతే !ఎందుకంటే...వాళ్ళ ఊళ్ళో వాడి జట్టు కుర్రాల్లంత 'చిరంజీ 'పార్టీ మరి !
ఆ వయసులో ..ఆ పార్టీలు తప్ప ..ఓట్లు కోసం ,కోట్ల కోసం కొన్ని 'రాజకీయ పార్టీలు' ఉంటాయని ..నోటు తీసుకుని ఓటు వేసే జనాలు ఉంటారని మాకు నిజ్జం గా తెలీదు !
ఆ రోజుల్లో 'ఓట్లు ఎలక్షనంటే' మా స్కూలికి సెలవని మాత్రమే తెలుసు మాకు !
ఆ ఎలక్షన్ల లాగే ..మనోళ్ళకి కూడా ఎలక్షన్లు ఉంటే మనోడే నేగ్గేస్తాడు కదరా ..అని ఒకడంటే ,లేదు మావోడే నెగ్గుతాడని ఇంకొకడు ,అలా ఒకరి మీద ఒకరు వాదాలు వేసుకునేవాళ్ళం .
ఒక్కోసారి కొట్టుకోడానికి కూడా రెడీ అయిపోయేవాళ్ళం .అది "చిన్నతనం " !

జనవరి పస్టుకి మా అభిమాన హీరోల్ల గ్రీటింగులనే కొనుకున్నేవాళ్ళం .ఎవరైనా మా 'ఎగస్పార్టీ ' హీరో గ్రీటింగు ఇస్తే ,అది వాళ్ళు చూడకుండా చించేసేవాళ్ళం.అంతటి అభిమానం(?)(దీనిని దురాభిమానం అనాలేమో :) ఉండేది మా లో !
ఆ అభిమానం మా వయసు తో పాటే కొంచెం పెద్దదవుతూ ..వచ్చింది .కానీ కొట్టుకోవడం ,తిట్టుకోవడాలు మాత్రం తగ్గినై .
కొన్ని రోజులకి ..మాలో కొంతమంది క్రిష్ణ ముసలాడైపోతున్నాడని ,మహేసు ఫ్యాన్సు కి మారిపోతే ,ఇంకొందరు వేరే హీరో ఫ్యాన్సుకి మారిపోయారు .చిరంజీ ఫ్యాన్సు లో కొంతమంది పవన్ కళ్యాణు వచ్చాక అటువైపు జారిపోయారు .
అలాగే ..బాలకృష్ణ ఫ్యాన్సు కొంతమంది ..నాగార్జున ఫ్యాన్సు ఇంకొంతమంది .
నేను మాత్రం 'చంటి' సినిమా చూసాక వేంకటేశు ఫ్యాన్సుకి మారిపోయాను .
మాది అసలే కోనసీమ కదా ..అభిమానాలు ,ఆప్యాయతలు కొంచెం ఎక్కువే !కానీ సమయాన్ని బట్టి కొంచెం అటు ఇటు మారిపోతాయి అంతే!:)

మాకు కొంచెం వయసొచ్చాక .. బజారు లో కి అడుగుపెట్టాక ఎవరికీ నచ్చిన' అభిమాన సంఘాల్లో'వాళ్ళు జాయినైపోయాము.ఆ అభిమానసంఘాల నేపధ్యం లో మా హీరోల పుట్టిన రోజులకి మాకు చేతనైనంత 'సమాజ సేవ' చేసే వాళ్ళం !మా అభిమానం ఈ రకం గా నైనా ఉపయోగపడుతున్నందుకు ..చాలా సంతోచించేవాన్ని నేను . మా అభిమాన హీరో సినిమా రిలీజు రోజైతే మాత్రం ..'ధియేటర్ 'లో హంగామా మొత్తం మా ఫ్యాన్స్ అసోషియేషన్ వాళ్ళదే !
ధియేటర్ మొత్తం రంగు రంగుల జండాల తో అలంకరించేవాళ్ళం."బెనిపిట్ "షో సినిమా టిక్కెట్లన్నీ మా చేతిలోనే ..! తెలిసిన వాళ్ళు మమ్మల్ని టిక్కెట్లు కోసం బ్రతిమాలుతుంటే ..తెగ కటింగులు యిచ్చెసేవాళ్ళం. 'వందరోజుల 'రోజుల పండగల్ని ఘనం గా చేసి ..'సితార' పేపరులో మా అసోషియేషన్ పేరు ,మా పేర్లు చూసుకుని తెగ మురిసిపోయేవాళ్ళం .అలా ఆ రోజుల్లో మా 'హవా' సాఫీగా సరదాగా నడిచిపోయింది .

రోజులు గడిచే కొద్దీ ..మా జట్టు లో కొంత మందిమి "బ్రతుకుతెరువు "కోసం నగర బాటలు పట్టాం!మిగిలిని వాళ్ళు ఊరిలోనే స్థిరపడిపోయారు .మా అభిమాన సంఘాలు పోయినా ..ఆ స్థానం ఇంకో కొత్త 'అభిమాన సంఘాలు' పుట్టుకొచ్చాయి .సినిమా హీరోలు కూడా పెరిగారు కదా !
మొన్నొక రోజు మా ఊరు నుండి మా చిన్న నాటి స్నేహితుడు సుబ్రహ్మణ్యం పోను చేసి "ఒరేయ్ !మొన్న మన గడియారం స్థంబం సెంటరు లో పెద్ద గొడవైపోయిందిరా.."అన్నాడు .'ఎందుకురా?!' అని ఆరా తీస్తే ..ఒక 'అభిమాన హీరో' కటౌట్ కి ఎవరో మట్టి కొట్టారట..ఆ కోపం తో వీళ్ళు అవతలి వాళ్ళ
'అభిమాన హీరో' సినిమా వాల్ పోస్టర్లు అన్నీ చించేసారట!ఎంత పిచ్చితనం !మేం చిన్నతనం లో ఏదో తెలియక కొట్టుకునేవాళ్ళం . కానీ వీళ్ళకి వయసొచ్చాక..జ్ఞానం తెలిసాక కూడా ఈ 'చిల్లర' పనులేమిటో?!వీళ్ళ పుట్టినరోజులు మానుకుని ఆ డబ్బులు తో ,వాళ్ళ అభిమాన హీరో ల పుట్టిన రోజులకి జెండాలు కొని 'పండగ' చేసే పిచ్చి జనాలు ఉన్నారు మా ఊళ్ళో !
ఈ అభిమానులు ఇలా కొట్టుకు చస్తున్నపుడైనా సదరు అభిమాన హీరోలు "మేమంతా ఒకటే ..మా కోసం మీరు కొట్టుకోవద్దు "అని చిన్న స్టేట్ మెంట్ ఇస్తే చాలా వరకు గొడవలు తగ్గొచ్చు .కానీ వాళ్ళకి ఇదంతా 'చిన్న విషయం' !

సరే ,ఆ సినీ అభిమానుల సంగతి కొంచెం పక్కన పెడితే ... నేను ఈ మద్య కొత్తగా చూసినవి(నేను చూడటం కొత్త తప్ప .ఇవి పాతవే ) "రాజకీయ అభిమాన సంఘాలు "!
ముఖ్యం గా హైదరాబాద్ లో ఐతే గల్లీకో నాయకుడు తయారై .చుట్టూ వందమంది తో ఓ 'అభిమాన సంఘాన్ని' పెట్టుకోవడం ..వాళ్ళ తో ఊరేగింపుగా వెళ్లి ఏదో ఒక రాజకీయ పార్టీలో ఆర్భాటం గా చేరిపోవడం ఒక ఫ్యాషను అయిపొయింది .ఆ అభిమానుల్లో ఆ అభిమానం ఎక్కడినుండి పొంగుకోస్తుందో ..ఆ నాయకులకి ,ఆ అభిమానులకే తెలియాలి మరి !

నాకు మాత్రం ఒక్కటి అనిపించింది -ఈ రాజకీయ అభిమాన సంఘాలతో పోల్చుకుంటే ,ఏమీ ఆశించకుండా గుండె నిండా నిండైన ప్రేమని నింపుకునే ఈ 'సినీ అభిమానులు''వెయ్యి రెట్లు బెటర్ అని !కానీ ఆ అభిమానం కొంచెం శ్రుతి మించకుండా ఉంటే మంచిది .
హీరోలూ!ఈ పిచ్చి అభిమానులని కొంచెం గమనిస్తూ ఉండండీ ...వాళ్ళకి అదే పదివేలు !

13, నవంబర్ 2010, శనివారం

మన 'బొట్టు' చెరిగిపోతుందా?!



మా నాయనమ్మ పేరు సీతా మహాలక్ష్మి .నేను పుట్టకముందే చనిపోయింది ఆవిడ.
నాకు ఆవిడ ని చూసే భాగ్యం లేదు కానీ ..ఆవిడ 'సౌభాగ్యం' గురుంచి మా ఊరి జనాలు గొప్ప గా చెబుతుంటే ..ఇప్పటికీ విని మురిసిపోతాను .
'పిల్లోడా!నీవు మీ నానమ్మ ని చూడలేదు గానీ..మహా తల్లీ !రూపాయి కాసంత బొట్టు ఎట్టుకుని..తలనిండా పూలు ఎట్టుకుని సాక్షాత్తూ..సీతమ్మ తల్లీ లా కళ కళ్ళాడతా తిరిగేదనుకో ..."అంటూ మా నాయనమ్మ ని కళ్ళ తో చుసిన వాళ్ళు కళ్ళని ఇంతలేసి చేసి చెబుతుంటే ..నా మనసుకి చాలా భాదైపోయేది. ఆ మహా తల్లి ని నేను ఎందుకు చూడలేక పోయానా..అని !
నా చిన్నతనం లో మా ఇంట్లో ఉండే ఒక్క బ్లాక్ &వైటు పోటో కూడా చెద పట్టేసి పాడై..నాకు ఉహ తెలిసే సరికి ఆమె రూపం నా మెదడు లో నిక్షిప్తమైపోకుండానే మాయమైపోయింది .

టివి ల్లో ఏ ఎమ్.ఎస్ .సుబ్బలక్ష్మి గార్నో .సుష్మ స్వరాజ్ గార్నో చూసినప్పుడల్లా ,రూపాయి కాసంత బొట్టు తో అచ్చం మా నాయనమ్మ ఇలానే వెలుగుపొతూ ఉండేదేమో అనుకోవడం తప్ప ,వేరే భాగ్యం లేకుండా పోయింది నాకు!
ఆడవాళ్ళ కి బొట్టు ఎంత అందాన్ని ఇస్తుందో ..ఆ మహా తల్లుల ముఖారవిందాల్నిచూస్తూనే అర్ధమౌతుంది .
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం గా మెరిసే 'బొట్టు' కి మన జీవన సరళి లో ఒక ప్రత్యెక స్థానం !
రాజు ల కాలం లో ..యుద్దానికి వెళ్ళేటప్పుడు' వీర తిలకం' దిద్ది సాగనంపెవారట !
బొట్టు అలంకారమే కాదు..ఒక భరోసా కూడా!
భక్తుడు కుంకుమ నుదుటన దిద్దినా..భార్య తిలకం దిద్దినా ...వీరుడి కి వీర తిలకం దిద్దినా ..ఆ 'బొట్టు' ఓ చల్లని చెయ్యి మనకి చేదోడు గా ఉన్నదన్న ధైర్యాన్ని ఇస్తుంది !
మా అమ్మ కూడా పొద్దు పొద్దున్నే నిద్ర లేచి ,నుదుటున రూపాయ కాసంత కాకపోయినా ..పావలా బిల్లంత తిలకం దిద్ది ఆపై కుంకుమ అద్ది ..అచ్చం లక్షి దేవి లా మెరిసిపోతుంది .
నా కంటే ముందే నిద్ర లేచి 'సూర్య బింబాన్ని' నుదుటున అలంకరించుకునే అమ్మని బొట్టు లేకుండా చూడటం ..నా చిన్న తనం నుండి ఇప్పటికీ వరకూ ఒక్కసారి కూడా తటస్థ పడలేధంటే ..అతిశయోక్తి కాదు .ఇప్పటికీ ప్రతి రోజు అంతే శ్రద్దగా భక్తి గా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది అమ్మ .
మా అమ్మ ఒక్కరే కాదు.. కొన్ని సంత్సరాల క్రితం నాటి 'అమ్మలు' అందరూ అంతే ..ఎంతో భక్తి శ్రద్దలతో 'తిలక ధారణ' చేస్తారు .
కానీ ఈ మద్య కాలం లో కొంత మంది 'అమ్మల' కి మాత్రం బొట్టు ఒక అలంకారం మాత్రమే ...
ఈ కాలం అమ్మాయిలకైతే ...బొట్టు ఒక 'ఎబ్బెట్టు'!
మొన్నీ మద్యనే మా ఊళ్ళో కొంత మంది ఆడవాళ్లు 'మత మార్పిడి' పేరిట నుదుటన బొట్టు ని నిర్ధాక్షిణ్యం గా చెరిపేసుకున్నారు.

ఇలాగే సాగితే ...
కాలక్రమం లో భరత మాత నుదుట పైన మన సౌభాగ్యపు 'బొట్టు' చెరిగిపోతుందా?
మన తరువాత తరాల పిల్లలకి మన సాంప్రదాయక బొట్టు,పాఠ్య పుస్తకాలలో ఒక 'చరిత్ర పాఠం' గానే మిగిలిపోతుందా ?!ఏమో !

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...